హైదరాబాద్ నగర్ అభివృద్ధిలో భాగంగా గౌలిగూడ నుంచి ఫలక్ నుమా వరకు మెట్రో రైలు కోసం ఇవాళ భూమి పూజ చేశామన్నారు సీఎం
పాత బస్తీలో మెట్రో రైలు విస్తరణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ పూర్తి చేశారు. ఈరోజు పాత బస్తీలో సీఎం రేవంత్ రెడ్డి మెట్రోకు శంకుస్థాపన చేశారు. ఫలక్ నుమాలోని ఫరూఖ్ నగర్లో సీఎం భూమిపూజ నిర్వహించారు. ఏడాదిలోగా మెట్రో అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. హైదరాబాద్ నగర్ అభివృద్ధిలో భాగంగా గౌలిగూడ నుంచి ఫలక్ నుమా వరకు మెట్రో రైలుకు ఇవాళ సీఎం భూమిపూజ చేసినట్లు తెలిపారు. తమ ప్రభుత్వం వరుస అభివృద్ధి పనులతో ముందుకు సాగుతుందన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేస్తారని, మిగతా సమయాల్లో అభివృద్ధే తమ ప్రాధాన్యత అని అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ కు తాగునీరు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి షబ్బీర్ అలీ, ఎంఐఎం అధినేత, ఎంపీ అసుద్దీన్ ఒవైసీ హాజరయ్యారు.
ప్రభుత్వం రూ.2 వేల కోట్లతో 5.5 కి.మీ మార్గంలో ఈ మెట్రో రైలును వేస్తోంది. ఇందులో 4 స్టేషన్లు ఉన్నాయి. ఇది చిన్న ప్రాజెక్టు అని చెప్పడానికి.. పదేళ్లయినా ఆచరణకు నోచుకోలేదు. ఎందుకు అంటే.. పాతబస్తీలో మెట్రోకు మొదట్లో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అక్కడ చాలా మంది పేదలు ఉన్నారు. వారి ఇళ్లను తొలగించి వేరే చోట స్థిరపడాల్సి వచ్చింది. 1100 నిర్మాణాలు తొలగించాల్సి ఉందని అధికారులు తెలిపారు.
0 Comments