Rajanna Siricilla Vemulavada
Temple: శివోహం.. రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు!
మహాశివరాత్రి పర్వదినం రోజున భక్తులు పరమశివుని అభిషేకించిన పూజించిన,పూజను చూసి తరించిన పుణ్యఫలాలు లభిస్తాయని అర్చక స్వాములు సైతం చెబుతున్న పరిస్థితి.
కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా, పేదల పెన్నిధిగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీపార్వతి రాజరాజేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రంలో మూడు రోజులపాటు మహాశివరాత్రి జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి జాతర పర్వదినం సందర్భంగా ..భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో వచ్చారు. దీంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. పర్వదినం సందర్భంగా స్వామివారిని దర్శించుకునే భాగ్యం దొరకడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు.
గత మహాశివరాత్రి జాతర జాతర ఉత్సవంతో పోలిస్తే ఈసారి మహాశివరాత్రి జాతర మహోత్సవాలకు భక్తుల సంఖ్య స్వల్పంగా తగ్గిందని చెప్తున్నారు. అయితే రాత్రి జాగారానికి మాత్రం అధిక సంఖ్యలో భక్తులు వస్తారని, ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో ముందుగానే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తర్వాతే సమ్మక్క సారలమ్మని దర్శించుకోవడం ఆనవాయితీగా ఉన్న తరుణంలో ఈసారి వేములవాడ రాజన్న సన్నిధిలో జరిగే మహాశివరాత్రి జాతర మహోత్సవానికి ప్రభావం పడిందని కొందరు భక్తులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
0 Comments